ఆస్కార్ బరిలో మనదేశ రైతు కథ

By Prashanth MFirst Published Sep 18, 2019, 3:21 PM IST
Highlights

 ఓ భారత రైతు జీవితగాథతో తెరకెక్కిన మోతీభాగ్ అనే డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఓ కుగ్రామానికి చెందిన విద్యాదత్ శర్మ అనే రైతు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం కావటం విశేషం.

ఆస్కార్ పురస్కారాల్లో మొదట నుంచీ మన దేశం వెనకబడే ఉంది.  అయితే  భారత్ నుంచి క్రమం తప్పకుండా నామినేషన్లు మాత్రం వెళ్తూనే ఉన్నాయి.  అవార్డులు గెలుచుకోవడం ఎంతో అరుదైన విషయంగా మారినా ఆ ఉత్సాహం, ప్రోత్సాహం మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. తాజాగా, ఓ భారత రైతు జీవితగాథతో తెరకెక్కిన మోతీభాగ్ అనే డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది.

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఓ కుగ్రామానికి చెందిన విద్యాదత్ శర్మ అనే రైతు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం కావటం విశేషం.వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ లోని పౌరీ గఢ్వాల్ ప్రాంతానికి చెందిన విద్యాదత్ శర్మ ని వ్యవయసాయ ఉద్యమకారుడు అనచ్చు. తన నివాసం ఉన్న ప్రాంతంలో అందరూ గిట్టుబాటి కాని వ్యవసాయం వదిలి ఉద్యోగాల వైపు పరుగులు పెట్టినా తాను మాత్రం తన ఊళ్లోనే  ఉండి వ్యవసాయం చేయడానికే మొగ్గుచూపాడు. గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ని కూడా వద్దనుకుని పంటపొలాలకే అంకితమయ్యాడు.  అలాగే భారత్ లో అత్యంత నాణ్యమైన రాడిష్ దుంపలు పండేది విద్యాదత్ శర్మ పొలంలోనే అనే స్దాయికి ఎదిగాడు.

అంతేకాదు, భారత్ లో అత్యంత పెద్దదైన రాడిష్ దుంపను కూడా శర్మే పండించి తన సత్తా ఏంటో చూపించాడు.ఇక శర్మ కేవలం ఓ వ్యవసాయ దారుడుగా  మాత్రమే కాదు మంచి సాహితీవేత్త కూడా. పద్యాలు రాయడం, పాడడం శర్మకు వ్యవసాయేతర అభిరుచి అని చెప్పాలి. ఆయన జీవితం ఆధారంగా నిర్మల్ చందర్ దండ్రియాల్ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫిల్మ్ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఈ మేరకు దర్శకుడు నిర్మల్ చందర్ కు అభినందనలు తెలిపారు. 

click me!