ప్రభాస్తో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశాపటానీ జోడి కట్టబోతుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులోకీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్కి రెడీ అవుతుంది.
బోల్డ్ బ్యూటీ దిశా పటానీ ఎట్టకేలకు తెలుగులోకి కమ్ బ్యాక్ కాబోతుంది. ఈ అమ్మడు తెలుగులో సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా ప్రభాస్తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్న ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే` ఒకటి. ఇందులో ప్రభాస్కి జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుంది. బిగ్బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్నిచ్చింది యూనిట్.
`ప్రాజెక్ట్ కే` లో మరో హీరోయిన్కి ఛాన్స్ ఉంది. సెకండ్ హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశారు. తాజాగా ఈ విషయాన్ని దిశా పటానీ అధికారికంగా వెల్లడించింది. తనకు `ప్రాజెక్ట్ కే` టీమ్ నుంచి వచ్చిన లెటర్, బోకేని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకుంది దిశా. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండటం విశేషం. ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనె అందాలతోపాటు దిశా అందాలు తోడు కాబోతున్నాయని, `ప్రాజెక్ట్ కే`లో గ్లామర్ డోస్ డబుల్ కాబోతుందని భావిస్తున్నారు డార్టింగ్ ఫ్యాన్స్.
సైన్స్ ఫిక్షన్గా `ప్రాజెక్ట్ కే`ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. భారీ విజువల్ వండర్గానూ ఉండబోతుందని చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ని మించి పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందన్నారు. సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే దిశా పటానీ `లోఫర్` చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకి పరిచయమైన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది దిశా పటానీ. సినిమా పరాజయం చెందినా, దిశా పటానీకి మాత్రం మంచి పేరొచ్చింది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో సినిమా చేయలేదు. అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. చివరగా ఆమె సల్మాన్తో `రాధే` చిత్రంలో మెరిసింది. ఇందులో ఆమె అత్యంత బోల్డ్,హాట్ రోల్స్ లో నటించి కనువిందు చేసింది. మరోసారి తెలుగు ఆడియెన్స్ కి తన అందాల విందుని వడ్డించబోతుందని చెప్పొచ్చు.