రాజోలులో ఆక్సిజన్‌ జెనరేటెడ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌

Published : May 23, 2021, 06:21 PM ISTUpdated : May 23, 2021, 07:24 PM IST
రాజోలులో ఆక్సిజన్‌ జెనరేటెడ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌

సారాంశం

డైరెక్టర్‌ సుకుమార్ కూడా ఆక్సిజన్‌ ప్లాంట్‌ పెట్టేందుకు ముందుకొచ్చారు. కరోనాతో పోరాడుతున్నా వారికి ప్రాణవాయువు అందించేందుకు తనవంతుగా ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు సుకుమార్‌.

చిరంజీవి, సోనూ సూద్‌ కరోనా బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్ కూడా ఆక్సిజన్‌ ప్లాంట్‌ పెట్టేందుకు ముందుకొచ్చారు. కరోనాతో పోరాడుతున్నా వారికి ప్రాణవాయువు అందించేందుకు తనవంతుగా ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు సుకుమార్‌. తన సొంత పట్టణమైన కాకినాడలోని రాజోలులో docs80 ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌ని తన సొంత వ్యయంతో నిర్మిస్తున్నారు. 

రాజోలు మండలం మట్టపర్రుకి చెందిన బండ్రెడ్డి సుకుమార్‌ కోనసీమలో ఆక్సిజన్‌ బెడ్లు దొరక్క అవస్థలు పడుతున్న పేద కోవిడ్‌ రోగుల కోసం తన వంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అందు కోసం దాదాపు రూ.25లక్షలు విరాళంగా అందిస్తున్నారాయన. ఇప్పటికే తొలి విడతగా 40 లీటర్ల సామర్థ్యంతో కూడిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసి అమలాపురంలోని అజాద్‌ ఫౌండేషన్‌కి అందజేశారు. అమలాపురంలోని తన స్నేహితుడు పంచాయితీరాజ్‌ డీఈఈ అన్యం రాంబాబుతో చర్చించి ఈ వితరణ కార్యక్రమం చేపట్టారు.

అజాద్‌ ఫౌండేషన్‌ కి సుకుమార్‌ సమకూర్చిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లని ఆ ఫౌండేషన్‌ ప్రతినిధులు బుధవారం కోవిడ్‌రోగులకు అందజేశారు. మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల కొనుగోలు చేసి వాటిని కోవిడ్‌ రోగులకు అందుబాటులోకి తేనున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత వల్ల కోనసీమలో ఆక్సిజన్‌ బెడ్లు, సిలిండర్లు దొరక్క చనిపోయే పరిస్థితులు ఉండకూడదని సుకుమార్‌ గతంలో చెప్పారు. ఇప్పుడు ఏకంగా తన సహాయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌నే ఏర్పాటు చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్సిజన్‌  ప్లాంట్‌ నిమిషానికి 80 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం సుకుమార్‌ అల్లు అర్జున్‌ హీరోగా `పుష్ప` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నారు సుకుమార్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?