హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న డైరెక్టర్ శంకర్ తనయుడు.. సినిమా గురించి తెలిస్తే షాకే

By team teluguFirst Published Jan 28, 2022, 9:01 PM IST
Highlights

దిగ్గజ దర్శకుడు శంకర్ పేరు చెప్పగానే వెండితెరపై గ్రాండ్ విజువల్స్, సందేశాత్మక చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇండియన్ సినిమా ప్రేక్షకులకు హాలీవుడ్ తరహా అనుభూతి అందించిన మొదటి దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. 

దిగ్గజ దర్శకుడు శంకర్ పేరు చెప్పగానే వెండితెరపై గ్రాండ్ విజువల్స్, సందేశాత్మక చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇండియన్ సినిమా ప్రేక్షకులకు హాలీవుడ్ తరహా అనుభూతి అందించిన మొదటి దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. శంకర్ ప్రస్తుతం సినిమాలు తెరకెక్కిస్తూనే తన పిల్లల భవిష్యత్తు చక్కదిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఎంబిబిఎస్ పూర్తి చేసింది. ఇటీవలే దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్ తో ఐశ్వర్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక చిన్న కుమార్తె అదితి హీరోయిన్ గా కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. 

ఇప్పుడు శంకర్ తన కుమారుడు ఆర్జిత్ పై ఫోకస్ పెట్టాడు. అర్జిత్ ఇప్పటికే నటనలో, దర్శకత్వంలో శిక్షణలో పూర్తి చేసుకున్నాడు. దీనితో శంకర్ తన కుమారుడుని హీరోగా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2004లో శంకర్ నిర్మించిన కాదల్ చిత్రం గుర్తుందిగా.. తెలుగులో ప్రేమిస్తే గా విడుదలై మంచి విజయం సాధించింది. 

ఆ చిత్రంలో ఎమోషనల్ అండ్ ట్రాజిడీ లవ్ స్టోరీగా ప్రేక్షకులని మెప్పించింది. ఇప్పుడు ఆ చిత్రానికి పార్ట్ 2 రాబోతోంది. కాదల్ చిత్రం బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో తెరకెక్కింది. పార్ట్ 2లో శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా నటించబోతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. 

ఇదిలా ఉండగా శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ స్టైల్ లో సందేశాత్మక అంశాలతో ఈ చిత్రం ఉండబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.  

 

click me!