20 ఏళ్ల తర్వాత రవితేజ చిత్రానికి సీక్వెల్.. ఆ హీరోయిన్ ఒప్పుకోదుగా, అన్నాతమ్ముళ్లు ఏం చేస్తారో మరి

By Asianet NewsFirst Published Nov 29, 2023, 12:27 PM IST
Highlights

మాస్ మహారాజ్ రవితేజ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. రవితేజ కెరీర్ లో ఇది ఒక మెమొరబుల్ మూవీ. 

మాస్ మహారాజ్ రవితేజ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. రవితేజ కెరీర్ లో ఇది ఒక మెమొరబుల్ మూవీ. రవితేజ, ఆసిన్ కెమిస్ట్రీ.. తల్లిగా జయసుధ నటన.. తండ్రి గా ప్రకాష్ రాజ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. 

తమిళంలో డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని తన తమ్ముడు జయం రవితో రీమేక్ చేశారు. తమిళంలో ఈ చిత్రం కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి అనే టైటిల్ తో తెరకెక్కింది. అక్కడ తల్లి పాత్రలో నదియా నటించింది. హీరోయిన్ గా తమిమలో కూడా అసిన్ నటించింది. అక్కడ కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్. మోహన్ రాజా చివరగా మెగాస్టార్ చిరంజీవితో తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Latest Videos

ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ రీమేక్ మూవీ కావడంతో వసూళ్లు రాలేదు. ఇప్పుడు మోహన్ రాజా తన తదుపరి చిత్రాలకు ప్లాన్ చేస్తున్నారు. మోహన్ రాజా కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు 20 తర్వాత సీక్వెల్ అన్నమాట. తల్లి పాత్రలో మరోసారి నదియానే నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: జబర్దస్త్ ఖుష్బూ లిప్ కిస్ అప్పట్లోనే సంచలనం..ఆ హీరోలతో రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మి, డింపుల్ క్రేజీ లిప్ లాక్స్

కానీ సమస్య ఇప్పుడు హీరోయిన్ తోనే. అసిన్ సినిమాలు మానేసి చాలా కాలమే అవుతోంది.  అసిన్ హీరోయిన్ కాకుంటే పూర్తిగా కొత్త తరహా కథతో రావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అన్నాతమ్ముళ్ళు మోహన్ రాజా, జయం రవికి ఇది పెద్ద సవాలే అని అంటున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఒక హీరోయిన్ నటించి సెకండ్ పార్ట్ సీక్వెల్ లో వేరే హీరోయిన్ నటించడం చాలా సార్లు జరిగింది. మరి మోహన్ రాజా ఏం చేస్తారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకు ఆగాల్సిందే. 

click me!