డైరెక్టర్ గోపీచంద్ మలినేని తండ్రి మృతి!

Published : Jul 28, 2019, 04:49 PM ISTUpdated : Jul 28, 2019, 04:56 PM IST
డైరెక్టర్ గోపీచంద్ మలినేని తండ్రి మృతి!

సారాంశం

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గోపీచంద్ మలినేని తండ్రి వెంకటేశ్వర్లు చౌదరి ఆదివారం రోజు మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స పొందుతున్నారు. 

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గోపీచంద్ మలినేని తండ్రి వెంకటేశ్వర్లు చౌదరి ఆదివారం రోజు మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం విషమించడంతో వెంకటేశ్వర్లు చౌదరి ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

తన కొడుకు డైరెక్టర్ గా రాణిస్తున్నప్పటికీ వెంకటేశ్వర్లు చౌదరి ఒంగోలు లోని స్వగ్రామం బొద్దులూరి వారి పాలెంలో నివసిస్తున్నారు. ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులంతా గోపీచంద్ కు సానుభూతి తెలియజేస్తున్నారు. 

గోపీచంద్ దర్శకుడిగా డాన్ శీను, పండగ చేస్కో, బలుపు, బాడీగార్డ్ లాంటి సివిజయవంతమైన చిత్రాలని తెరక్కించారు. సాయిధరమ్ తేజ్ తో తెరక్కించిన విన్నర్ చిత్రం నిరాశపరిచిన తర్వాత గోపీచంద్ తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్