గుడ్‌ న్యూస్‌ చెప్పిన దర్శకుడు అట్లీ.. త్వరలో తండ్రి పోస్ట్..

By Aithagoni RajuFirst Published Dec 16, 2022, 4:19 PM IST
Highlights

దర్శకుడు అట్లీ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్టు వెల్లడించారు. తన భార్య ప్రియ ప్రెగ్నెన్సీని ఆయన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.
 

ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారు. తన భార్య, నటి ప్రియ ప్రెగ్నెన్సీని శుక్రవారం ప్రకటించారు. బేబీ బంప్‌తో ఉన్న ప్రియ ఫోటోలు పంచుకున్నారు అట్లీ. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `మా కుటుంబం పెద్దది కాబోతుంది. ఈ శుభవార్తని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞులమై ఉన్నాం. అదే ప్రేమని మా చిన్నారికి కొనసాగించాలని కోరుకుంటున్నాం` అని తెలిపారు అట్లీ. 

ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు అట్లీ-ప్రియ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డకి జన్మనివ్వాలని వారు కోరుకుంటున్నారు. పెళ్లై ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరు పేరెంట్స్ కాబోతుండటం విశేషం. ప్రియ పలు సీరియల్స్ లో నటించారు. స్నేహితుల ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంత కాలం ప్రేమించుకున్న తర్వాత 20114లో ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mohan (@priyaatlee)

ఇక `రాజారాణి` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అట్లీ. నయనతారతోపాటు ఆర్య, నజ్రియా నజిమ్‌, జై హీరోహీరోయిన్లుగా నటించారు.  ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతో అట్లీ ఓవర్‌నైట్‌లో స్టార్‌ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన `థెరి`, `మెర్సల్‌`, `బిగిల్‌` చిత్రాలను రూపొందించారు. విజయ్‌తోనే ఆయన మూడు సినిమాలు చేయడం విశేషం. దీంతో స్టార్‌ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన షారూఖ్‌ ఖాన్‌తో కలిసి `జవాన్‌` సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌ కావడం విశేషం.

click me!