ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

By Mahesh JujjuriFirst Published Dec 25, 2022, 2:59 PM IST
Highlights

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పై ఆయన చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 
 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంజనీరింగ్ స్టూడెట్స్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో.. నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారంతా స్టార్సే అన్నారు అనిల్, వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో అనిల్ రావిపూడి పాల్గోన్నారు. ఈసందర్భంగా..అక్కడ విద్యార్ధులతో కలిసి సందడి చేశారు. వారితో కలిసి మాట్లాడారు. గ్రూప్ డిస్కర్షన్ కూడా చేశారు అనిల్. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి విద్యార్ధులు గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఒకటి ఉందన్నారు.  ఎప్పుడైనా మనకోసం అవకాశాలు రావు.. వాటిని వెతుక్కుంటూ మనం వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. ముఖ్కంగా విద్యార్ధులు ఈ విషయాలు అలవర్చుకోవాలి అన్నారు. జీవితంలో ప్రతీ విద్యార్ధి నిర్థిస్టమైన లక్యం పెట్టుకుని.. దానిని సాధించడం కోసం కష్టపడాలి.. చివరకు ఆ లక్ష్యాన్ని సాధించాలి అన్నారు అనిల్. 

అంతే కాదు సరికొత్తగా ఆలోచిస్తూ.. ఆ ఆలోచనలకు కాస్త టాలెంట్ జోడించి.. ఇప్పుడున్న్ టెక్నాలజీని ఉపయోగించుకుని స్టూడెట్స్ అద్భుతాలు చేయవచ్చు అన్నారు అనిల్. ఇప్పుడు ఉన్నన్నటి అవకాశాలు, సోర్స్ అప్పుడు లేవన్నారు. అందుకే సమయాన్ని వృధా చేసుకోకుండా జీవిత లక్ష్యాల కోసం కష్టపడాలి అన్నారు అనిల్ రావిపూడి. స్టార్ డైరెక్టర్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సక్సెస్ తరువాత ఖాళీగా ఉన్నారు. త్వరలో బాలయ్య బాబుతో సినిమానుసెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు అనిల్. పటాస్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన ఆయన.. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలతో వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్నారు. 

click me!