బాలయ్యతో 'పింక్' రీమేకా..?

By AN TeluguFirst Published Jul 6, 2019, 1:11 PM IST
Highlights

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో అప్పట్లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'పింక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. 

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో అప్పట్లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'పింక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు తమిళంలో 'పింక్' రీమేక్ తెరకెక్కుతోంది. అమితాబ్ పోషించిన పాత్రలో అజిత్ కనిపించనున్నారు.

తెలుగులో కూడా ఈ సినిమాను తీసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాను తెలుగులో బాలకృష్ణ కీలక పాత్రలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ పోషించిన పాత్రకు టాలీవుడ్ లో ఏ సీనియర్ హీరో అయినా బాగానే ఉంటారు.

కానీ దిల్ రాజు మాత్రం బాలయ్యతో చేయాలనుకుంటున్నాడు. చాలా కాలంగా దిల్ రాజుకి బాలయ్యతో సినిమా తీయాలనే కోరిక ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నాడట. 

ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రాజెక్ట్ లో 'పింక్' రీమేక్ చేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనుక ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. లేదంటే మరో కథ సిద్ధం చేసి బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. 

click me!