ఇప్పుడున్న పరిస్దితుల్లో షూటింగ్ లకు దారి లేదు, రిలీజ్ లకు అసలే లేదు. దాంతో దిల్ రాజు తన ప్రాజెక్టులపై ఏం నిర్ణయం తీసుకుని,నష్టాలు లేకుండా బయిటపడచ్చు అనేది ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదట నానితో నిర్మించిన ‘వి’ విషయంలో డెసిషన్ తీసుకున్నారు.
లాక్ డౌన్ వచ్చిన నాటి నుండీ దిల్ రాజు కన్ఫూజన్ లో ఇరుక్కుపోయారు. ఎందుకంటే ఆయన సినిమాలు కొన్ని రిలీజ్ కు రెడీ అయితే, మరికొన్ని షూటింగ్ స్టేజీలో ఉన్నాయి. వేరే ప్రాజెక్టులు అయితే స్క్రిప్టు లాక్ చేసుకుని షూటింగ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో షూటింగ్ లకు దారి లేదు, రిలీజ్ లకు అసలే లేదు. దాంతో దిల్ రాజు తన ప్రాజెక్టులపై ఏం నిర్ణయం తీసుకుని,నష్టాలు లేకుండా బయిటపడచ్చు అనేది ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదట నానితో నిర్మించిన ‘వి’ విషయంలో డెసిషన్ తీసుకున్నారు.
వాస్తవానికి దిల్ రాజుకు ‘వి’ సినిమా నిమిత్తం ఎన్ని ఓటీటి ఆఫర్స్ వచ్చినా అటు వైపు మ్రొగ్గు చూపలేదు. ఎంత ఆఫర్ చేసినా టెమ్ట్ అవకుండా థియోటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఆయన ‘వి’ సినిమాని క్రిసమస్ కానుకగా విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అప్పటికి థియోటర్స్ ఓపెన్ అయ్యి..పరిస్దితిలు ఓ కొలిక్కి వస్తాయని ఆయన భావించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ లుగా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్,టీజర్ కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది.
నాని ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను క్రిసమస్ కానుకగా విడుదల కానుందా లేదా అన్నది సస్పెన్స్.