ప్రముఖ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత జైరా వాసిం సినిమాల నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. ‘దంగల్’ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు జైరా. తొలి చిత్రంతోనే ఆమె జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకుఅవకాశాలు వరుస కట్టాయి. జైరా నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది
ప్రముఖ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత జైరా వాసిం సినిమాల నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. ‘దంగల్’ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు జైరా. తొలి చిత్రంతోనే ఆమె జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకుఅవకాశాలు వరుస కట్టాయి. జైరా నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.తానున్న వృత్తిని తన మతంతో పోల్చడం నచ్చలేదని, అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు.
ఈ పోస్ట్ లో ఉన్నదేమిటంటే...‘నేను ఈ సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోయినప్పటికీ ఇక్కడ ఉండాల్సిన దాన్ని కాను. ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. నేను బాలీవుడ్లోకి అడుగుపెట్టగానే చాలా పాపులారిటీ వచ్చేసింది. నన్ను ఎంతో మంది రోల్మోడల్ అని, విజయానికి చిరునామా అని సంబోధించారు. కానీ నేను ఎంచుకోవాల్సిన వృత్తి ఇది కాదు. ప్రస్తుతం నాకున్న గుర్తింపుతో నేను సంతోషంగా లేను.
ఫలానా సెలబ్రిటీలా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ ఐదేళ్లు ఎంతో కష్టపడ్డాను. ఇందుకోసం నాలోని కొత్త నైపుణ్యాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, నా జీవనశైలిని మార్చుకుంటూ ఉన్న క్రమంలో నేను ఈ పరిశ్రమలో ఉండాల్సిన దాన్ని కాదన్న విషయం బోధపడింది’
‘ఈ పరిశ్రమ నాకు ప్రేమను, మద్దతును, ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఇదే పరిశ్రమ నన్ను నమ్మకాన్ని కోల్పోయేలా కూడా చేసింది. నేను ముస్లింని అయినందుకు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ భయాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ నా వల్ల కావడంలేదు. ఈ విషయంలో ఒకసారి కాదు వందసార్లు ఓడిపోయాను. నా ప్రశాంతతను కోల్పోయేలా, అల్లాతో నాకున్న అనుబంధాన్ని చెడగొట్టేలా చేసే వాతావరణంలో నేను జీవించలేను’ అని వెల్లడించారు.