విక్టరీ వెంకటేష్ చివరగా నటించిన సైంధవ్ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎందుకనో వెంకీకి ఇటీవల యాక్షన్ చిత్రాలు కలిసి రావడం లేదు. సైంధవ్ తర్వాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఏంటనే ఉత్కంఠ నెలకొంది.
విక్టరీ వెంకటేష్ చివరగా నటించిన సైంధవ్ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎందుకనో వెంకీకి ఇటీవల యాక్షన్ చిత్రాలు కలిసి రావడం లేదు. సైంధవ్ తర్వాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఏంటనే ఉత్కంఠ నెలకొంది. అయితే వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అనౌన్స్ చేశారు.
ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర లాంచ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ పోస్టర్ లో గన్నుతో పాటు రోజా పువ్వు కూడా కనిపిస్తోంది. అంతే కాదు తాళిబొట్టు కూడా కనిపిస్తోంది.
తాళిబొట్టుని గన్నుకి కట్టి చూపిస్తున్నారు. ఇది ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. అంటే రొమాన్స్, పెళ్లి తో పాటు యాక్షన్ కూడా బలంగా ఉండబోతోందని ఇలా సింబాలిక్ గా చెబుతున్నారా అని అంతా భావిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని జూలై 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
The beginning of an 𝐄𝐗cellent journey on a very blessed note❤️ x Grand Pooja ceremony on JULY 3rd 🪔
Exciting updates coming your way soon! 🔥
Victory pic.twitter.com/ypxcHBAReD
త్వరలో మరో క్రేజీ అప్డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్ లో గతంలో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు వచ్చాయి.