హృతిక్ తో మల్టీస్టారర్... హాట్ టాపిక్ గా ప్రభాస్ రెమ్యూనరేషన్?

By Sambi ReddyFirst Published Feb 1, 2023, 5:13 PM IST
Highlights

పఠాన్ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్  హ్రితిక్ రోషన్-ప్రభాస్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు వార్తలు వస్తుండగా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 
 


బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పేరు ఇండియా వైడ్ మారుమ్రోగుతుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన వార్, పఠాన్ బాలీవుడ్ కి ఊపిరి పోశాయి. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పరిశ్రమ కోలుకునేలా చేశాయి. ఈ మూడేళ్ళలో సిద్ధార్థ్ ఆనంద్ చిత్రాలే అతిపెద్ద హిట్స్ గా ఉన్నాయి. పఠాన్ ప్రభంజనం ఎలా ఉందంటే రోజుకు వంద కోట్లు అవలీలగా వసూలు చేస్తుంది. వెయ్యి కోట్ల వసూళ్లు సునాయాసంగా దాటేలా ఉంది. షారుక్ ఖాన్ కి మరపురాని విజయాన్ని సిద్ధార్థ్ ఆనంద్ ఇచ్చారు. 

సిద్ధార్థ్ ఆనంద్ నెక్స్ట్ మూవీగా ఫైటర్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇది కూడా ఆయన మార్క్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. కాగా నెక్స్ట్ ఆయన భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట. హృతిక్-ప్రభాస్ లతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నారట.  ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసేందుకు బడా బడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. 

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ కూడా సుముఖంగా ఉన్నారట. అయితే ఈ చిత్రం కోసం ఆయన రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆల్రెడీ చేస్తున్న సినిమాలకు ఆయన వంద కోట్లకు పైన తీసుకుంటున్నారు. హ్రితిక్ తో చేసే మల్టీస్టారర్ కి మరింత భారీగా అడుగుతున్నారట. ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా ప్రభాస్-హ్రితిక్ మల్టీస్టారర్ కార్యరూపం దాల్చితే... దేశాన్ని ఊపేసే కాంబినేషన్ అవుతుంది. 

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సలార్ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే ప్రాజెక్ట్ కే సెట్స్ పై ఉంది. దర్శకుడు మారుతితో డీలక్స్ రాజా చేస్తున్నారు. ఇది కూడా ఓ షెడ్యూల్ జరుపుకుంది. కాగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించి ఉన్నారు. కాబట్టి హృతిక్ తో మూవీ ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. 

click me!