చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హీరో సుమంత్

Published : May 04, 2018, 10:12 AM IST
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హీరో సుమంత్

సారాంశం

చిక్కుల్లో హీరో సుమంత్

ప్రముఖ హీరో నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ చిక్కుల్లో పడ్డారు. ఆయన, ఆయన సోదరి సుప్రియ ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. సుమంత్ హీరోగా ఇటీవల ‘ నరుడా డోనరుడా’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమాతోనే సుమంత్ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమాకి సుమంత్, ఆయన సోదరి సుప్రియలు నిర్మాతలుగా వ్యవహరించారు.

కాగా.. ఈ సినిమా సమయంలో సహనిర్మాతలకు వీరు చెక్ లు అందజేయగా.. అవి బౌన్స్ అయ్యాయి. దీంతో సహనిర్మాతలు వారిపై ప్రకాశం జిల్లా మార్కాపురంలో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం వీరిద్దరూ మార్కాపురం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. న్యాయమూర్తి పఠాన్‌ షియాజ్‌ ఖాన్‌ ఈ కేసును జూన్‌ 28కి వాయిదా వేశారు.

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే