మహేష్ బాబుని కలిసిన కాంగ్రెస్ జాతీయ నేత శశి థరూర్

pratap reddy   | Asianet News
Published : Sep 08, 2021, 07:24 PM ISTUpdated : Sep 08, 2021, 07:44 PM IST
మహేష్ బాబుని కలిసిన కాంగ్రెస్ జాతీయ నేత శశి థరూర్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ మహేష్ లుక్, యాటిట్యూడ్ మెస్మరైజింగ్ గా ఉంది. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సర్కారు వారి పాట షూటింగ్ లొకేషన్ లో ఓ అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత శశి థరూర్. శశి థరూర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న పొలిటీషియన్. శశిథరూర్ ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

హైదరాబాద్ లోని ఓ హోటల్ వద్ద సర్కారు వారి పాట షూటింగ్ జరుగుతోంది. అదే హోటల్ లో శశి థరూర్ ఉండడంతో ఆయన మహేష్ బాబుని, ఎంపీ గల్లా జయదేవ్ ని మీట్ అయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడం కోసం శశి థరూర్ హైదరాబాద్ వచ్చారు. 

మహేష్ ని మీట్ అయిన విషయాన్ని శశి థరూర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ఫోటోస్ లో మహేష్ లుక్ ఆకట్టుకుంటోంది. చెవి పోగుతో మహేష్ మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. మహేష్, శశిథరూర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. 

 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌