'చిత్రలహరి' అందరూ చూడాల్సిన సినిమా: చిరంజీవి

By Udaya DFirst Published Apr 15, 2019, 12:46 PM IST
Highlights

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'చిత్రలహరి'. 

 

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. ఏప్రిల్ 12న విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.

ఈ సంద‌ర్భంగా ..మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ''కిషోర్ తిరుమ‌ల 'చిత్ర‌ల‌హ‌రి' చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభను నిరూపించుకున్నారు. ఇక తేజు కూడా న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు. మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో చాలా చ‌క్క‌గా న‌టించాడు. ప‌రిణితిని సాధించిన న‌టుడిగా నిరూపించుకున్నాడని'' అన్నారు.

పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించి నిండుద‌నం తెచ్చారని.. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడని అన్నారు.  బంధాలు, అనుబంధాలు గురించి ముఖ్యంగా తండ్రి కొడుకు మ‌ధ్య అనుబంధం గురించి చ‌క్క‌గా చెప్పారని.. ఎలాంటి ఒడుదొడుకులు వ‌చ్చినా మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డానికి కృషితో ముందుకు వెళ్లాల‌ని చెప్పిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి' అంటూ  ఈ వేస‌వికి విడుద‌లైన చిత్ర‌ల‌హ‌రి ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రమని తన అభిప్రాయాన్ని  వెల్లడించారు. 

click me!