సవాళ్లని ఎదురించి నటుడిగా నిలబడి.. పొట్టి వీరయ్యకి చిరంజీవి సంతాపం

Published : Apr 26, 2021, 10:58 AM IST
సవాళ్లని ఎదురించి నటుడిగా నిలబడి.. పొట్టి వీరయ్యకి చిరంజీవి సంతాపం

సారాంశం

దాదాపు 300వందలకుపైగా చిత్రాల్లో నటించి తనేంటో నిరూపించుకున్నారు పొట్టి వీరయ్య. ఈ సందర్భంగా ఆయన నటన, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపారు.   

`వ్యక్తిగతంగా, వృతి పరంగా ఎన్నో సవాళ్లని ఎదురించి పొట్టివీరయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబడ్డాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నార`ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నటుడు పొట్టి వీరయ్య అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 300వందలకుపైగా చిత్రాల్లో నటించి తనేంటో నిరూపించుకున్నారు పొట్టి వీరయ్య. ఈ సందర్భంగా ఆయన నటన, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపారు. 

`వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో  సవాళ్ళను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పొట్టి వీరయ్య  మృతి నన్ను ఎంతో  కలచి వేసింది. ఆయన  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నా. ఆయ‌న‌ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నా` అని అన్నారు. సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని .. చిరంజీవి గారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పొట్టి వీరయ్య వెల్ల‌డించారు. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి. తరువాత ఉండవు. ఈ మధ్య  నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని  తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించార‌ని పొట్టి వీరయ్య  తెలిపారు. 

ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు నేడు(సోమవారం) జరుపనున్నట్టు కుటుం సభ్యులు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించారు. ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘ కాలం సేవ‌లందించిన వీర‌య్య మృతి ప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. రాజశేఖర్‌, జీవిత ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లర్పించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?