చిరు 154... సునామి రేంజ్ అప్డేట్, ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ!

By team teluguFirst Published Aug 21, 2021, 2:38 PM IST
Highlights

 సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న ఆచార్య షూటింగ్ పూర్తి కాగా మరో రెండు ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. నెలల క్రితమే చిరంజీవి తన ప్రాజెక్ట్స్ లైన్ అప్ పై క్లారిటీ ఇచ్చారు.

కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు ప్రకటిస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు ఎవర్ గ్రీన్ స్టార్ చిరంజీవి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న ఆచార్య షూటింగ్ పూర్తి కాగా మరో రెండు ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. నెలల క్రితమే చిరంజీవి తన ప్రాజెక్ట్స్ లైన్ అప్ పై క్లారిటీ ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ తో పాటు, దర్శకులు మెహర్ రమేష్, బాబీలతో చిత్రాలు చేయనున్నట్లు తెలియజేశారు. 


తమిళ దర్శకుడు మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ చేస్తున్న చిరంజీవి, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది. కాగా చిరు బర్త్ డేకు మరో రోజు వ్యవధి ఉండగా నేడు రెండు ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటన చేశారు. ముందుగా చెప్పినట్లే మెహర్ రమేష్ తో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. తమిళ హిట్ మూవీ వేదాళంకి ఇది రీమేక్ అనే వాదన పరిశ్రమలో ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన లేదు. 


ఇక చిరు 154వ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించనున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పోస్టర్, రేపు సాయంత్రం 4:05 గంటలకు చిరు బర్త్ డే కానుకగా రానుంది. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.  


చిరు 154 పోస్టర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంటుంది అంటూ... నిర్మాణ సంస్థ హామీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. మొత్తంగా రానున్న ఏడాదిన్నర కాలంలో చిరంజీవి నుండి మొత్తం మూడు చిత్రాల విడుదల కానున్నాయి. ఇది మెగా ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ చేసే న్యూస్ అని చెప్పవచ్చు. 

High Tide Warning ⚠️

MEGA WAVE Hits the shore tomorrow at 4:05 PM 🔥

A MEGA poster to give you goosebumps is on its way 💥 🎉

MegaStar 😎 pic.twitter.com/tCMYBtNd7j

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!