Acharya Postponed: మెగాస్టార్‌ `ఆచార్య` వాయిదా.. మహమ్మారి దెబ్బకి మరో సినిమా ఔట్‌

By Aithagoni RajuFirst Published Jan 15, 2022, 1:01 PM IST
Highlights

సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా వాయిదా  పడింది. మెగాస్టార్‌ సినిమా సైతం వెనక్కి తగ్గింది. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆచార్య` చిత్రం వాయిదా పడింది.

 కరోనా మహమ్మారి దెబ్బకి పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా వాయిదా  పడింది. మెగాస్టార్‌ సినిమా సైతం వెనక్కి తగ్గింది. చిరంజీవి(Chiranjeevi), రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి నటించిన `ఆచార్య`(Acharya) చిత్రం వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తాజాగా చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ త్వరలో అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. 

The release of stands postponed due to the pandemic.

The new release date would be announced soon.

Megastar pic.twitter.com/oVjqcvfl9U

— Konidela Pro Company (@KonidelaPro)

`కోవిడ్‌ విజృంభన కారణంగా ప్రస్తుతం నెలకొన్ని  పరిస్థితుల దృష్ట్యా `ఆచార్య` విడుదలని వాయిదా  వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం.  అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు  జాగ్రత్తగా  ఉండండి, కరోనా నియమాలను పాటించండి` అని పేర్కొంది యూనిట్‌. దీంతో Chiranjeevi అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే  సంక్రాంతికి రావాల్సిన రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా వల్ల రాలేకపోయాడు, ఇక ఫిబ్రవరిలోనైనా మెగా హీరోలను చూడాలనుకున్న అభిమానులకు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. కరోనా మహమ్మారి సినిమాలకు  పెద్ద  శాపంగా మారిపోయింది. 

మున్ముందు రాబోతున్న పెద్ద సినిమాలు కూడా వీటిబాటలోనే సాగనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలోనే `ఖిలాడీ`, `భీమ్లా నాయక్‌` చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వారి విడుదల విషయంలోనూ అనుమానాలు నెలకొన్నాయి. కరోనా రోజు రోజుకి మరింతగా విస్తరిస్తుంది. దేశంలో కేసులు రోజుకి మూడు లక్షల వరకు  నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల  కష్టంగా మారిపోయింది. దీంతో వాయిదా పడుతున్నాయి. 

ఇక చిరంజీవి, రామ్‌చరణ్‌ ఫస్ట్ వెండితెరపై కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు. ఇందులో చిరు సరసన కాజల్‌, చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. 

click me!