నటుడు కెప్టెన్ రాజు మృతి.. విషాదంలో దక్షిణాది చిత్రపరిశ్రమ

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 10:11 AM IST
Highlights

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మిలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు.

తెలుగు సినిమా బలిదానంతో వెండితెరకు పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో సుమారు 500పైగా చిత్రాల్లో నటించారు. చివరి సారిగా మలయాళ చిత్రం ‘‘ మాస్టర్ పీస్‌లో’’ కనిపించారు.

click me!