‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) వంటి సూపర్హిట్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సునీల్ పాత్ర ట్రిమ్మింగ్ కు గురైంది.
కరోనా దెబ్బతో వచ్చిన మూడు నెలల లాక్ డౌన్ రకరకాలుగా జన జీవితంపై తన ప్రభావం చూపెడుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో విలవిల్లాడుతున్నారు. టాలీవుడ్ కామెడీ హీరో కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ సునీల్ పరిస్దితి కూడా కరోనా దెబ్బతో తల క్రిందులు అయ్యిందని తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో రూపొందనున్న చిత్రంలో సునీల్ కోసం హిలేరియస్ పాత్రను బోయపాటి క్రియేట్ చేసారట. అయితే షూటింగ్ గ్యాప్ రావటంతో బోయపాటి మళ్లీ స్క్రిప్టుని తిరగ రాసుకున్నారు.
ఈ క్రమంలో సీరియస్ గా సాగే తమ చిత్రంలో సునీల్ కామెడీ వచ్చే పలచన అయ్యిపోతుందని, సీరియస్ నెస్ తగ్గుతుందని భావించారట. దాంతో మొహమాటం లేకుండా సునీల్ సీన్స్ చాలా భాగం కట్ చేసేసారట. ఆ విషయం సునీల్ కు చెప్పి ఎక్కువ డేట్స్ అక్కర్లేదని వివరించారట.
‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) వంటి సూపర్హిట్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ తెగ వైరల్ అవుతోంది. ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అరవై నాలుగు సెకన్ల నిడివి గల ఈ టీజర్ ఇప్పటికే దాదాపు ఏడు మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
బీబీ3 ఫస్ట్ రోర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. బాలయ్య కూడా టీజర్కు వస్తున్న రెస్పాన్స్ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘మా కాంబినేషన్(బాలయ్య-బోయపాటి) గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్ ఇది మూడో చిత్రం. అయితే ఇది మూడో చిత్రం అని ఎక్కడా టెన్షన్ తీసుకోవడం లేదు. హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది ఈ సినిమా అన్నారు.