బిగ్ బాస్2: తేజస్విని చూసి ఎమోషనల్ అయిన సామ్రాట్!

By Udayavani DhuliFirst Published Sep 28, 2018, 10:43 AM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. మరో రెండు రోజుల్లో షో ముగియనుంది. దీంతో ఈ వారం మొత్తం కూడా హౌస్ మేట్స్ మధ్య ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా వారితో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేశాడు బిగ్ బాస్. 

బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. మరో రెండు రోజుల్లో షో ముగియనుంది. దీంతో ఈ వారం మొత్తం కూడా హౌస్ మేట్స్ మధ్య ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా వారితో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేశాడు బిగ్ బాస్.

నిన్నటి ఎపిసోడ్ లో ఫైనల్స్ కి వచ్చిన కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పిలుస్తూ బిగ్ బాస్ హౌస్ లో వారి జర్నీని ప్లే చేసి చూపించారు బిగ్ బాస్. దీప్తి, సామ్రాట్, తనీష్ లు ఈ వీడియోలను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో గీతామాధురి, కౌశల్ ల జర్నీ చూపించబోతున్నారు. అలానే ఈరోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ కనిపించనున్నారు. ఫినాలే ఎపిసోడ్ కి ముందు హౌస్ నుండి వెళ్లిపోయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లోకి తీసుకొస్తారు బిగ్ బాస్.

ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ తో మరింత ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. తేజస్వి, దీప్తి సునైనా.. రాగానే సామ్రాట్, తనీష్ లను హత్తుకున్నారు. ఇక తేజస్వి.. గీతాని వెతుక్కుంటూ బాత్రూం దగ్గరకి వెళ్లి.. గీతా.. నువ్వు ఇంకా ఎలిమినేట్ అవ్వలేదా..? అంటూ నవ్వుతూ కామెడీ పండించే ప్రయత్నం చేసింది. 

click me!