Bigg Boss Telugu 7: ప్రశాంత్ ను బకరాను చేసి బలి చేసిన శివాజీ, రహస్యంగాప్రేమించుకుంటున్న గౌతమ్- రతిక

By Mahesh JujjuriFirst Published Nov 22, 2023, 11:06 PM IST
Highlights

బిగ్ బాస్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇంతకు ముందు సీజన్ల కంటే కాస్త భిన్నంగా ఈ సీజన్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగా ట్విస్ట్ మీద ట్వీస్ట్ లతో బిగ్ బాస్ 7 సాగుతోంది. 
 

బిగ్ బాస్ సీజన్ 7 లో 80 రోజులు పూర్తి చేసుకుంది. టాప్ 5 కంటెస్టెంట్స్  ఎవరో తెలియడానికి చాలా దగ్గరలో ఉంది. కాగా బిగ్ బాస్ లో రాను రాను రసవత్తరమైన ఆటలు పెరిగిపోతున్నాయి. కాగా 81 రోజు ఎపిసోడ్ లో కిల్లర్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.  ఈ టాస్క్ లో బిగ్ బాస్ వైఫ్ చనిపోయింది. ఆమెను ఎవరో మర్డర్ చేశారు. ఇంతకీ వారు ఎవరు. హౌస్ లో ఉన్న కిల్లర్ ఎవరు..? కిల్లర్ ను కనుగొనడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు గా అంబటి అర్జున్, అసిస్టెంట్ గా అమర్ ను నియమించాడు బిగ్ బాస్. 

అటు బిగ్ బాస్ వైఫ్ కు చెఫ్ గా ప్రశాంత్, మేనేజర్ గా శివాజీ, బట్లర్స్ గా ప్రియాంక, యావర్. దోబీగా గౌతమ్, సెక్యూరిటీగా రతిక ఉన్నారు. ఇక ఈ మర్ధర్ ఇన్వెస్టిగేషన్ ను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి టీవీ జర్నలిస్ట్ లుగా శోభా, అశ్వినీ ఉన్నారు. ఇక అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అసలు విషయం కనుగోనే పనిల్ ఉన్నారు అమర్, అర్జున్. ఇక ఎవరి పనిలో వారు ఉండగా ఎవరి కంటా పడకుండా.. రహస్యంగా ప్రేమించుకుంటున్నారు గౌతమ్, రతికలు. చాటుగా ముద్దు ముచ్చటలు తీర్చుకుంటున్నారు. ఇన్వస్టిగేషన్ లో భాగంగా అందరి బ్యాగ్ లు చెక్ చేశారు ఇద్దరు. 

Latest Videos

Brahmamudi Manas : బిగ్ బాస్ ఫేమ్... బ్రహ్మముడి మానస్ పెళ్లి సందడి, హల్దీ వేడుకల్లో హడావిడి చేసిన జంట

ఈమధ్య లో  ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే అమర్ కు, శోభకు చిన్నవాగ్వాదం జరుగుతుంది. ఈ విషయంలో శోభ అలిగి సహకరించడం మానేస్తుంది. అమర్ , శోభ మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది. దాంతో కోపం ఆపుకోలేక అమర్ చేతిలో లాఠీని విసిరి పారేస్తాడు. అక్కడ గొడవ సాగుతుండగానే బిగ్ బాస్ విలన్ గా ఉన్న శివాజీని మర్డర్ చేయాల్సిందిగా ఆదేశిస్తారు. ఈక్రమంలో ప్రశాంత్ మొక్కను పోస్ట్ బాక్స్ లో పెట్టి మర్డర్ ను సక్సెస్ చేయాలని అంటాడు. ఈక్రమంలో ప్రశాంత్ ను స్టోర్ రూమ్ లో లాక్ చేస్తాడు శివాజి. ఆతరువాత ప్రశాంత్ మొక్కను పోస్ట్ బాక్స్ లో పెట్టి.. మర్డర్ ను సక్సెస్ ఫుల్ గా  కంప్లీట్ చేస్తాడు. అందరితో పాటు ప్రశాంత్ ను వెతికినట్టు నటిస్తుంటాడు. 

`బిగ్‌ బాస్‌ తెలుగు 7` విన్నర్‌పై వీజే సన్నీ ప్రిడిక్షన్‌.. టాప్ 5 కంటెస్టెంట్లు వీరే

అటు ఇన్వెస్టిగేన్ కొనసాగుతుండగానే.. ప్రశాంత్ లోపల ఉండలేక లాజిక్ లు వెతుకుతుంటాడు. ఇక హౌస్ మెంట్స్ ప్రశాంత్ లోపల ఉన్నట్టు కనిపెడతారు. శివాజీ ఫస్ట్ మర్డర్ కంప్లీట్ చేసి..టాస్క్ లో సక్సెస్ అవుతాడు. దాంతో ప్రశాంత్ మరణించి.. ఘోస్ట్ గా మారుతాడు.  ప్రశాంత్ మాత్రం దెయ్యంగా మారి తిరగాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక మొక్క కనిపించకపోవడంతో . ప్రశాంత్ వెతుకుతూ ఉంటాడు. ఇక ఈరోజుతో టాస్క్ కంప్లీట్ అయ్యింది. 

click me!