ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు గడిచిందా, వర్ధంతి రోజున కౌశల్ మందా ఎమోషనల్ కామెంట్స్

By tirumala ANFirst Published Jan 7, 2024, 12:35 PM IST
Highlights

లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ ఒక్కో మెట్టు ఎదుగుతున్న సమయంలో అతడి కెరీర్, జీవితం రెండూ పేకమేడలా కూలిపోయాయి.

లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ ఒక్కో మెట్టు ఎదుగుతున్న సమయంలో అతడి కెరీర్, జీవితం రెండూ పేకమేడలా కూలిపోయాయి. కుటుంబ సభ్యులకు, అభిమానులకు చేదు జ్ఞాపకాలు మిగిల్చి ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

లవర్ బాయ్ రోల్స్, ట్రాజిడీ ప్రేమ కథలకు ఉదయ్ కిరణ్ బ్రాండ్ గా మారిపోయాడు. నువ్వు నేను, చిత్రం, మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఉదయ్ కిరణ్ యువతలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ అతడి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు ఉదయ్ కిరణ్ ని మానసికంగా కుంగదీసాయి. ముఖ్యంగా మెగా ఇంటికి అల్లుడు కావాల్సింది కానీ అది జరగలేదు.

Latest Videos

దీనిపై అనేక రూమర్స్ ఉన్నాయి. నెమ్మదిగా అవకాశాలు చేజారడంతో ఉదయ్ కిరణ్ ఆరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. చూస్తూనే ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు గడచిపోయింది. జనవరి 5న ఉదయ్ కిరణ్ పదవ వర్థంతి జరిగింది. ఉదయ్ కిరణ్ వర్థంతి సందర్భంగా బిగ్ బాస్ మాజీ విన్నర్ కౌశల్ మందా కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. 

ఉదయ్ కిరణ్ తన ప్రియ మిత్రుడు అంటూ కౌశల్ అభివర్ణించాడు. కౌశల్ శ్రీరామ్ చిత్రంలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ తో కౌశల్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. కౌశల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఉదయ్ కిరణ్ 10వ వర్థంతి సందర్భంగా కాస్త ముందుగానే పోస్ట్ పెట్టాల్సింది. కానీ తిరుపతి వెళ్లడం వల్ల ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నాను. 

ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు గడచిపోయింది అంటే నాకే నమ్మశక్యంగా లేదు. ప్రపంచంలో ఉన్న ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అంతా తన 10వ వర్థంతిని జరుపుకున్నారు. ఉదయ్ కిరణ్ మనతోనే ఉన్నాడని భావిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు కౌశల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. 

click me!