బూతు సినిమాలో బిగ్ బాస్ ఫేమ్!

By Udayavani DhuliFirst Published Oct 30, 2018, 12:05 PM IST
Highlights

డాన్సర్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన భానుశ్రీ.. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయింది.  'బాహుబలి' సినిమాలో తమన్నాతో కలిసి ఒకట్రెండు సీన్లలో కనిపించిన భానుశ్రీ.. తమన్నాకి డూప్ గా కూడా నటించింది. అయితే ఈ సినిమాతో కూడా ఆమెకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. 

డాన్సర్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన భానుశ్రీ.. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయింది. 
'బాహుబలి' సినిమాలో తమన్నాతో కలిసి ఒకట్రెండు సీన్లలో కనిపించిన భానుశ్రీ.. తమన్నాకి డూప్ గా కూడా నటించింది. అయితే ఈ సినిమాతో కూడా ఆమెకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.

కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిందో.. ఆమెకి కాస్త గుర్తింపు లభించింది. కౌశల్ మీద చేసిన ఆరోపణల కారణంగా భాను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాక తప్పలేదు. అయితే బయటకొచ్చిన తరువాత ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'ఢీ' కార్యక్రమానికి యాంకర్ గా అవకాశం వచ్చింది.

అయితే కొన్ని కారణాల వలన ఈ భామ ఆ షో నుండి తప్పుకుంది. తాజాగా విడుదలైన 'ఏడు చేపల కథ' అనే సినిమా ట్రైలర్ లో భానుని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ మొత్తం బూతుతో నింపేశారు. అశ్లీలత డోస్ ఎక్కువగా ఉన్న ఈ ట్రైలర్ లో ఒక ఫ్రేమ్ లో భానుశ్రీ కనిపించింది. మిగిలిన హీరోయిన్లంతా టాప్ లెస్ గా కనిపిస్తున్నా.. భాను మాత్రం అటువంటి బోల్డ్ సీన్స్ లో నటించలేదు.

ఒక చోట హీరో పక్కన కూర్చొని మాట్లాడుతూ కనిపించింది. అయితే ఇప్పుడు ఈ బూతు ట్రైలర్ లో భాను కనిపించడంతో ఆమె ఇలాంటి కథని ఎలా ఓకే చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. సామ్ జె చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. 

18+ టీజర్: వామ్మో.. ఆర్ఎక్స్ 100కి బాబులా ఉంది!

click me!