ఏప్రిల్ లో రానున్న 1971 భారత సరిహద్దు మూవీ...రియల్ స్టోరీ

Published : Mar 08, 2017, 01:54 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఏప్రిల్ లో రానున్న 1971 భారత సరిహద్దు మూవీ...రియల్ స్టోరీ

సారాంశం

భారత్ పాక్ సరిహద్దు వద్ద 1971లో జరిగిన ఘటనలపై చిత్రం మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, అల్లు శిరీశ్ నటించిన 1971 ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్న చిత్ర నిర్మాతలు

ప్ర‌తి స‌మ‌స్య‌కి యుధ్ధం స‌మాధానం కాదు. యుధ్ధం లేని ప్ర‌పంచాన్ని చూడాలనుకునే ఓ మేజ‌ర్ క‌థే ఈ 1971 భార‌త‌ స‌రిహ‌ద్దు చిత్రం. 1971 వ సంవ‌త్సరంలో పాకిస్తాన్‌కి, భార‌త‌దేశానికి మ‌ద్య జ‌రిగిన యుధ్ధ నేప‌ద్యంలో ఈ క‌థాంశం న‌డుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జ‌రిగిన ప్ర‌దేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌టం జ‌రిగింది. రియ‌ల్ గా యుధ్ధ ట్యాంక‌ర్స్ ని వాడి షూట్ చేశారు. బోర్డ‌ర్ లోని ప్ర‌తి సైనికుడు త‌మ క‌ర్త‌వ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాల‌ను సైతం లెక్క‌పెట్ట‌కుండా దేశ‌ర‌క్ష‌ణ కోసం ఎలా ప‌ని చేస్తార‌నేది ఈ చిత్రంలోని ముఖ్య క‌థాంశం.

 

ఈ చిత్రాన్నిమ‌ల‌యాళంలో మంచి చిత్రాల ద‌ర్శ‌కుడు, న‌టుడు అంత‌కు మించి మాజి భార‌త సైనికాధికారి మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వహించారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మెహ‌న్‌లాల్ హీరోగా న‌టించారు. మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో అల్లు శిరీష్ న‌టించారు. ఈ చిత్రం మొద‌టి లుక్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. భార‌త‌దేశంలో అన్ని భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల‌ కానుంది. ప్ర‌తి భార‌తీయుడు చూడ‌వ‌ల‌సిన తెలుసుకోవ‌ల‌సిన చిత్రం ఈ 1971 భార‌త‌ స‌రిహ‌ద్దు.. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై, పూజా కాత్యాయ‌ని నిర్మిస్తున్నారు. 

 

మాట‌లు- ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఫోటొగ్రఫి- సుజిత్ వాసుదేవ్‌, ఎడిట‌ర్-సమ్జిత్‌, ఆర్ట్- ప‌లు.కె.జార్జ్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌-  గొపి సుంద‌ర్‌, సంగీతం- సిద్దార్ధ విపిన్‌, నాజిమ్ అర్ష‌ద్‌, రాహుల్ సుబ్ర‌మ‌ణ్య‌న్‌,  నిర్మాత‌- పూజా కాత్యాయ‌ని, ద‌ర్శ‌క‌త్వం- మేజ‌ర్ ర‌వి

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్