క్రేజీ ప్రాజెక్ట్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్న 'దృశ్యకావ్యం' దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

Published : Apr 08, 2017, 01:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
క్రేజీ ప్రాజెక్ట్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్న 'దృశ్యకావ్యం' దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

సారాంశం

విజయ్‌, కీర్తీ సురేష్‌ జంటగా భరతన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'భైరవ' తెలుగు ప్రేక్షకులకు అందించనున్న 'దృశ్యకావ్యం' దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి 

 

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ ఫిలింస్‌ పతాకంపై గతంలో 'దృశ్యకావ్యం' వంటి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్‌ 7). ఈ సందర్భంగా ఆయన తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ..'తమిళంలో విజయ్‌, కీర్తీ సురేష్‌ జంటగా భరతన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'భైరవ' చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయనున్నాము. సంతోష్‌ నారాయన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మే లో రిలీజవుతుంది. అలాగే రాజ్‌తరుణ్‌, జై, అంజలి, జెన్నీ అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా శనీష్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో 'బెలూన్‌' అనే చిత్రం ప్రస్తుతం కోడైకెనాల్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై ఎండింగ్‌కి రిలీజ్‌ చేయనున్నాము. అలాగే విక్రమ్‌, నయనతార హీరో హీరోయిన్లు గా డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న 'సామి 2' చిత్రాన్ని ఈ ఇయర్‌ ఎండింగ్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాము. మహేష్‌ గోవిందరాజు సమర్పణలో పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రాలు ఈ ఇయర్‌లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాము...అన్నారు.

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?