ఆపదలో ఉన్న అభిమానికి బాలయ్య ఫోన్

By Surya PrakashFirst Published Jun 14, 2021, 5:53 PM IST
Highlights

తన అభిమానికి నేరుగా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన ఫోన్ చేసిన ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

బాలయ్య అభిమానులను చాలా ప్రేమగా చూసుకుంటారు. అభిమానులు తన ప్రాణ సమానులని ఎప్పుడూ చెప్తూంటారు. అందుకే బాలయ్యను తమ గుండెల్లో పెట్టుకుని పూజ చేస్తారు ఫ్యాన్స్. ఆయన అభిమాలంటే ఎంత కేర్ తీసుకుంటారనేదానికి తాజా ఘటనే నిదర్శనం. కొద్ది రోజుల కిందట చెట్టు మీద నుంచి కిందకు పడటంతో నడుముకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైన తన అభిమానికి నేరుగా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన ఫోన్ చేసిన ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

వివరాల్లోకి వెళ్తే...  శాంతిపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మురుగేష్ చిన్నప్పటి నుంచి నందమూరి కుటుంబానికి వీరాభిమాని.. ఇక బాలయ్య బాబుకు అయితే చెప్పక్కర్లేదు. ప్రాణం ఇచ్చేస్తారు.  నెల రోజుల కిందట  మురుగేష్ టెంకాయ చెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. చికిత్స చేసుకోవడానికి శక్తికి మించిన బాధ కావడంతో అప్పులు చేసినా.. వైద్యానికి సరిపడంత దొరకలేదు. దీంతో మురుగేష్ ను ఇంట్లో పెట్టుకునే చూసుకుంటున్నారు అక్క, అమ్మ.

ఈ క్రమంలో  మురుగేష్ తో బాలయ్య ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. అభిమాని బాగోగులు, ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను మంచానికే పరిమితమవడంతో తల్లి కూలి పనులకు వెళ్లాల్సి వస్తుందంటూ అభిమాని బాలయ్యతో తన బాధ పంచుకున్నారు.  

బాలయ్య ఫోన్ లో గతంలో తనకు జరిగిన ప్రమాదాలను బాలకృష్ణ అభిమానితో పంచుకున్నారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరగడంతో నడుముకు తీవ్ర గాయమైందని, ధైర్యంగా ఉండటంతో తిరిగి కోలుకున్నానని గతం గుర్తు చేస్తూ మురుగేష్‌కు ధైర్యం చెప్పారు. అలాగే తన వీరాభిమాని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి ఆరా తీశారు. అధైర్యపడకుండా మందులు వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకోమని బాలయ్య అభిమానికి చెప్పారు. ధైర్యంగా ఉంటే స్పీడ్ గా తిరిగి కోలుకోవచ్చని బాలయ్య అభిమానికి చెప్పారు. తక్షణ అవసరాల కోసం రూ.40 వేలు కూడా పంపించారు. 
 

click me!