'అర్జున ఫల్గుణ'.. వైరల్ అవటం వెనక ఆశ్చర్యపరిచే రీజన్

By Surya PrakashFirst Published Nov 18, 2021, 9:25 AM IST
Highlights

ఫస్ట్ మూవీ ‘జోహార్’ తో ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ మర్ని డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’.. అమిృత హీరోయిన్. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 శ్రీ విష్ణు కెరీర్ ని  పరిశీలిస్తే, కొత్తదనం ఉన్న కథలకే ఆయన ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నాడనే విషయం అర్థమవుతుంది. అందువల్లనే ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆడియన్స్ ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ కథల్లో కొత్తదనం .. ఆయన పాత్రల్లోని వైవిధ్యం వాళ్లకి బాగా నచ్చటమే ప్లస్ అవుతోంది. ఆ మధ్యన 'గాలి సంపత్' ఫలితం నిరాశ పరిచినా, 'అర్జున ఫల్గుణ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కీ .. సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఇవి దూసుకుపోతున్నాయి. వైరల్ అవుతూ ట్రెండింగ్ లో ఉంటున్నాయి అందుకు కారణం ఏమిటనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చగా మారింది.

శ్రీవిష్ణు గత చిత్రాలను మించి ఈ మూవీ అప్‌డేట్స్‌ వైరల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే అందుకు కారణం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అని తేలింది. శ్రీవిష్ణు సినిమాకి, ఎన్టీఆర్‌‌ ఫ్యాన్స్‌కి లింక్ ఉండటమే  ప్లస్ అయ్యింది.  ఎన్టీఆర్ వీరాభిమానిగా ఈ  సినిమాలో ఆయన కనిపించనున్నాడు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర హడావిడి చేసే అభిమానిగా మెప్పించనున్నాడు. ఎన్టీఆర్ సినిమాల రిలీజులకి హడావుడి చేయడం, కటౌట్లకి అభిషేకాలు చేయడం లాంటి సీన్లు కూడా ఉన్నాయని సమాచారం. అలాగే చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పేరు కూడా వాడతాడని చెప్తున్నారు.

టీజర్ రిలీజ్ అయ్యాక ఈ  విషయాలన్నీ బయటికి రావడం, షూటింగ్ సమయంలోని కొన్ని ఫొటోలు బయిటకు రావడంతో ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టి పడటం జరిగింది. తమ అభిమాన హీరో ప్రస్తావన ఉన్న సినిమా కాబట్టి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని వాళ్లు డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నారని సమాచారం. అందుకే ఈ మూవీ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓపినింగ్స్ కు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాయిపడితే ఇంక చెప్పుకునేదేముంది. థియోటర్స్ దగ్గర రచ్చ రచ్చే.

Also read EVK: రాజా రవీంద్రకు కోటి రూపాయలు తెచ్చి పెట్టిన ఆ మూడు ప్రశ్నలు ఇవే, మీకు ఆన్సర్స్ తెలుసా?
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

Also read Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన టీషర్ట్స్.. షూట్‌ చేసుకుని స్విమ్మింగ్ పూల్లో పడ్డ సన్నీ
 

click me!