న్యూస్ ఛానెల్ అధినేతకు స్టార్ డైరెక్టర్ 'చెప్పుల' సత్కారం

By Surya PrakashFirst Published Sep 11, 2020, 8:14 AM IST
Highlights

ఇంతకుముందు ఓసారి ప్లైట్ లో వెళ్తూ అర్నాబ్‌తో గొడవ పెట్టుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో కలిసి అనురాగ్ గురువారం ముంబయిలోని రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఆఫీస్ వద్దకు వెళ్లాడు. వీళ్లిద్దరూ చెప్పును లామినేట్ చేసిన ఫొటో ఫ్రేమ్‌లను చేతిలో పెట్టుకుని అక్కడికి వెళ్లారు. జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న అర్నాబ్‌‌కు పురస్కారాల రూపంలో ఈ ఫొటో ఫ్రేమ్‌లు ప్రదానం చేయడం కోసం అనురాగ్, కునాల్ అక్కడికి వెళ్లామని అన్నారు. 

నిరసనలు వ్యంగ్యాత్మంగా చేసి వార్తల్లో నిలుస్తూంటారు కొందరు. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. గురువారం రిపబ్లిక్ టీవీ ఛానెల్ ముందు చేసిన పని సంచలనం రేపింది. దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్ గా  ప్రొజెక్ట్ చేసుకునే ఆ ఛానెల్ అధినేత అర్నాబ్ గోస్వామికు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు అనురాగ్. అర్నాబ్ ధాటికి భయపడి సాధారణంగా ఏ సెలబ్రెటీలు అతడి జోలికి వెళ్లరు. దాంతో అనురాగ్ చేసిన పని  ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వివరాల్లోకి వెలితే....

ఇంతకుముందు ఓసారి ప్లైట్ లో వెళ్తూ అర్నాబ్‌తో గొడవ పెట్టుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో కలిసి అనురాగ్ గురువారం ముంబయిలోని రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఆఫీస్ వద్దకు వెళ్లాడు. వీళ్లిద్దరూ చెప్పును లామినేట్ చేసిన ఫొటో ఫ్రేమ్‌లను చేతిలో పెట్టుకుని అక్కడికి వెళ్లారు. జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న అర్నాబ్‌‌కు పురస్కారాల రూపంలో ఈ ఫొటో ఫ్రేమ్‌లు ప్రదానం చేయడం కోసం అనురాగ్, కునాల్ అక్కడికి వెళ్లామని అన్నారు. 

అర్నాబ్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన వీరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే వీళ్లేమీ పెద్దగా గొడవ చేయకుండా వచ్చేశారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  గురువారం అనురాగ్‌ పుట్టిన రోజు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కంగనా రనౌత్ వ్యవహారాల్లో రిపబ్లిక్ టీవీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కొందరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వాళ్ల ఇమేజ్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని అనురాగ్  విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా నిరసనకు ప్రయత్నించారు.
 

click me!