చిరుకు హోదా సెగ.. రంగస్థలం ఈవెంట్ లో విద్యార్థుల నిరసన

Published : Mar 19, 2018, 03:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
చిరుకు హోదా సెగ.. రంగస్థలం ఈవెంట్ లో విద్యార్థుల నిరసన

సారాంశం

చిరుకు హోదా సెగ.. రంగస్థలం ఈవెంట్ లో విద్యార్థుల నిరసన

మెగాస్టార్ చిరంజీవికి పొలిటికల్ సెగ తగిలింది. రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆదివారం చిరంజీవి వైజాగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక హోదా సెగ తగిలింది. ప్రత్యేక హోదా కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరు రాకతో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు ప్లకార్డులతో నిరనస తెలియజేసారు. చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే.

 

చిరంజీవికి తన తనయుడు రాంచరణ్ సినిమా ఈవెంట్స్ మినహా ఏపీ సమస్యలు పట్టవా అంటూ ఏయూ యువత ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏయూ విద్యార్థులని పోలీస్ లు నిలువరించారు. పాలిటిక్స్ కి బ్రేక్ ఇచ్చిన తరువాత చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో సైరా చిత్రంలో నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్