పోలీసులను ఆశ్రయించిన యాంకర్‌ గాయత్రి భార్గవి..

By Aithagoni RajuFirst Published Aug 13, 2021, 8:00 AM IST
Highlights

గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌ బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకమైన పోసులు చేస్తున్నారని యాంకర్‌ గాయత్రి భార్గవి పోలీసులను ఆశ్రయించింది.

ప్రముఖ తెలుగు యాంకర్‌, నటి గాయత్రి భార్గవి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాకింగ్ కి గురైందని ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌ బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకమైన పోసులు చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల పంచుకున్న పోస్ట్ లు తాను పెట్టినవి కావని ఆమె తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ నోట్‌ని కూడా షేర్‌ చేసుకుంది. 

ఇదిలా ఉంటే దీనిపై ఏపీసీ కె.వి.ఎం ప్రసాద్‌ మాట్లాడుతూ, యాంకర్‌ భార్గవి ఎఫ్‌బీ అఫీషియల్‌ అకౌంట్‌తోపాటు మరో అకౌంట్‌ని దుండగులు ఆమె పేరు మీద క్రియేట్‌ చేసినట్టు గుర్తించామని తెలిపారు. సోషల్‌ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పాస్‌ వర్క్ లను మార్చుకోవాలని సూచించారు. ఇక యాంకర్‌ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు. 

యాంకర్‌గా, టీవీ, సినిమా నటిగా రాణిస్తున్న భార్గవి `ఒక లైలా కోసం`, `అవును`, `ప్రేమ కావాలి` వంటి సినిమాలతోపాటు `అభిరుచి` టీవీ షోకి యాంకర్‌గానూ చేసింది. పలు సీరియల్స్ లోనూ నటిస్తుంది.

click me!