పర్ఫెక్ట్ గా జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది హాట్ యాంకర్ అనసూయ. జీవితం అనేది ప్రాక్టికల్ మరియు రియల్ అని ఆమె రెండు పదాలలోనే వేదాంతం వల్లించింది. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది.
హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియా పోస్ట్ లు అప్పుడప్పుడూ సంచలనం రేపుతుంటాయి. సామజిక విషయాలపై ఆమె తరచుగా స్పందిస్తూ ఉంటారు. ఆడవాళ్ళ పట్ల అన్యాయాలు, అసభ్యకర వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేస్తారు. ఫెమిస్ట్ గా పేరున్న అనసూయ తనపై వచ్చే ట్రోలింగ్స్ ని కూడా గట్టిగా తిప్పికొడతారు. తరచుగా అనసూయ బట్టలపై చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అనేక బుల్లితెర మరియు పబ్లిక్ వేదికలపై అనసూయ ధరించే డ్రెస్ పై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.
మానసికంగా ధృడమైన అనసూయ ఆ ట్రోల్స్ కి అదే స్థాయిలో సమాధానం ఇస్తుంది. నేనేమి ధరిస్తే మీకేంటని బల్ల గుద్ది అడుగుతుంది. అనసూయ మనస్థత్వాని పోలె ఆమె సోషల్ మీడియా పోస్ట్ లు కూడా ఉన్నాయి. తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకోవడంతో పాటు ''పరిపూర్ణంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. కేవలం వాస్తవికతే ప్రామాణికం'' అని కామెంట్ పెట్టారు.
అక్కరలేని నియమాలు పాటిస్తూ ఎవరి కోసమో పర్ఫెక్ట్ గా బ్రతకాలని ఎప్పుడూ అనుకోలేదు, ప్రాక్టీకల్ గా జీవించడమే అనే అర్థంలో ఆమె కామెంట్ ఉంది. నిజజీవితంలో కూడా అనసూయ అలానే ఉంటుంది. తనకు నచ్చినట్లు ఆమె లైఫ్ స్టైల్ ఉంటుంది. మాట్లాడాలనిపిస్తే ఎటువంటి బర్నింగ్ టాపిక్ పైన అయినా మాట్లాడుతుంది.ఈ తత్త్వం కూడా అనసూయకు సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది.
నటిగా కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అనసూయ పాత్ర దేవదాసి అని తెలుస్తుండగా, బోల్డ్ కంటెంట్ కలిగి వుంటుందట.
Never wanted perfect, just real. 📸 : #ShauryaBharadwaj #MySonshine 👦🏻🧿
A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Sep 27, 2020 at 3:15am PDT