ఏ ఇండియన్ సినిమాకు దక్కని రికార్డ్ 'సరైనోడు' సొంతం!

First Published Jul 16, 2018, 6:55 PM IST
Highlights

భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది

భారతీయ సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది 'సరైనోడు' సినిమా. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాపంథాగా ఈ సినిమా రూ.127 కోట్లు వసూలు చేసిన బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఇందులో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. యూట్యూబ్ లో  రెండు కోట్ల మంది ఈ సినిమాను వీక్షించడం విశేషం.

భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే రెండు కోట్ల వ్యూస్ క్రాస్ చేసిన ఈ సినిమాకు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 

click me!