శివాజీరాజా నిజంగానే మోసం చేశాడా..?

By Udayavani DhuliFirst Published Sep 3, 2018, 2:47 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కి సంబంధించిన కొంత డబ్బుని అందులో ఉన్న కొందరు సభ్యులు తమ వ్యాపకాల కోసం ఖర్చు చేస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కి సంబంధించిన కొంత డబ్బుని అందులో ఉన్న కొందరు సభ్యులు తమ వ్యాపకాల కోసం ఖర్చు చేస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం మా అధ్యక్షుడు శివాజీరాజా అనే ఆరోపణలు వచ్చాయి. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేష్.. డబ్బు ఎలా మిస్ యూజ్ చేశారనే విషయం తెలుసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేశారట.

దీనికి సంబంధించి ఆయన ఎమెర్జన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ని ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఇటీవల 'మా' అసోసియేషన్ అమెరికాలో చిరంజీవితో ఓ ఈవెంట్ ని నిర్వహించింది. మా అసోసియేషన్ ఫండ్స్ కోసం చిరు తన వంతు సహాయం అందించారు. ఆ కార్యక్రమం ద్వారా భారీ ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేశారు. అయితే ఈ సొమ్ము నేరుగా 'మా' అసోసియేషన్ ఖాతాల్లోకి రాకుండా అసోసియేషన్ కొందరు సభ్యుల పెర్సనల్ అకౌంట్స్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ విషయాలు బయటకి రావడంతో శివాజీరాజాతో పాటు పలువురు అసోసియేషన్ మెంబర్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన శివాజీరాజా.. తను చాలా ఏళ్లుగా అసోసియేషన్ ఉన్నానని, ఎప్పుడూ అసోసియేషన్ డబ్బుని వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకోలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదే విషయంపై మాట్లాడడానికి ప్రధాన కార్యదర్శి నరేష్ మరికొంత మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో కలిసి మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో.. చూడాలి!

ఇది కూడా చదవండి..

మోసం చేశానని నిరూపిస్తే.. గుండు కొట్టించుకుంటా: నటుడి సంచలన వ్యాఖ్యలు!

click me!