డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తుంది. స్టార్లకి అది పెద్ద శాపంలా మారుతుంది. రష్మిక దీని బారిన పడింది.ఇప్పుడు అలియా భట్ వంతు వచ్చింది.
`ఏఐ`(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ) టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో, అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. వారి ఫేస్లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది.
ఆ తర్వాత కత్రినా కైఫ్, సారా టెండుల్కర్, కాజోల్ ఫోటోలు, వీడియోలను సైతం ఇలానే మార్ఫింగ్ చేశారు. డీప్ ఫేక్ ఫోటోలతో రచ్చ చేశారు. తాజాగా ఇప్పుడు అలియాభట్ని టార్గెట్ చేశారు. ఓ లేడీకి అలియాభట్ ఫేస్ని యాడ్ చేసి సోషల్ మీడియాలో వదలగా అది దుమారం రేపుతుంది. ఇందులో బ్లూ ఫ్లోరల్ ధరించిన లేడీ చాలా బోల్డ్ గా కూర్చొని ఉంది. ఆమె ఫేస్కి అలియా భట్ ఫేస్ యాడ్ చేయగా అది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై ఆమె అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారిని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అలియాభట్.. ప్రస్తుతం `జిగ్రా` అనే మూవీలో నటిస్తుంది. దీనికి ఆమె కూడా నిర్మాత కావడం విశేషం. ఇక రణ్బీర్ని కపూర్ని పెళ్లి చేసుకున్న అలియాభట్.. ఆ మధ్యనే కూతురుకి జన్మనిచ్చింది. కొన్ని రోజులు మాతృత్వాన్ని ఆస్వాధించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది. ఆమె వరుసగా కమిట్ అవుతూ కెరీర్కి మాతృత్వం అడ్డు కాదని నిరూపిస్తుంది. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్గా రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది.
అలియాభట్.. ఇటీవల `రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాణి` చిత్రంలో నటించింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతోపాటు హాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ `హార్ట్ ఆఫ్స్టోన్` చిత్రంలో మెరిసింది. ఇది కూడా ఆమెకి పెద్దగా పేరుని తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం `జిగ్రా` మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదిలా ఉంటే గతేడాది ఈ బ్యూటీ `ఆర్ఆర్ఆర్` చిత్రంతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.