అక్కినేని వారి కుటుంబం ఫోటో అదిరింది

First Published Nov 6, 2016, 1:08 PM IST
Highlights

సోషల్ మీడియాలో సమంత గత కొద్ది రోజులుగా హంగామా చేస్తోంది. ప్రతీ సారి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చే సమంత.. ఈసారీ తన పేజ్ లో ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసింది. సమంత, నాగచైతన్యలతో పాటు యంగ్ కపుల్ అఖిల్, శ్రేయా భూపాల్ లు కూడా కలిసి ఉన్న ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన సమంత, ఫ్యామిలీ అంటూ రాసింది.

సమంత చైతూ.. ముందులా ఎవరికీ తెలియకుండా చాటు మాటు వ్యవహారాలు నడిపించడం మానేసి కొన్ని రోజులుగా ఓపెన్ గానే కలిసి తిరగడం, డేట్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం...'అవి లేకపోతే నేను జీవించలేను అనే వాటిలో మూడు చెప్పండి' అని ఓ ఫ్యాన్‌ అడగ్గా స్పందిస్తూ.. 'చైతూ, మస్కతీ ఐస్‌క్రీమ్‌, వర్క్‌' అని సమాధానమిచ్చింది సమంత.

ఇక నాగచైతన్య...'ఏమాయ చేసావే' సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే 'బెస్ట్ ఫ్రెండ్స్'గా మారిపోయామని, ఆ స్నేహమే ఒకరిపై ఒకరికి మరింత ఇష్టాన్ని పెంచింది. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని చెప్పుకొచ్చారు. మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.

click me!