డేటింగ్‌ యాప్‌లో వేధిస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌కి నటి ఫిర్యాదు..

Published : May 26, 2021, 09:49 AM IST
డేటింగ్‌ యాప్‌లో వేధిస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌కి నటి ఫిర్యాదు..

సారాంశం

నటి గీతాంజలి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనని కొందరు దుండగులు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. 

నటి గీతాంజలి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనని కొందరు దుండగులు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. డేటింగ్‌ యాప్‌లో తనన చిత్రాలను జోడించారని ఆమె నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై  వినయ్‌ కథనం ప్రకారం `గుర్తు తెలియని వ్యక్తులు డేటింగ్‌ యాప్‌లలో తన చిత్రాలను జోడించారని గీతాంజలి ఫిర్యాదు చేశారు. దీంతో తాను తీవ్ర వేధింపులకు గురవుతున్నానని ఆమె పేర్కొన్నట్టు వెల్లడించారు. దీనిపై విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే