రాజ్‌కుంద్రాకి మరో షాక్‌.. శిల్పా శెట్టి భర్తపై సచినో జోషి సంచలన వ్యాఖ్యలు

Published : Jul 23, 2021, 04:31 PM IST
రాజ్‌కుంద్రాకి మరో షాక్‌.. శిల్పా శెట్టి భర్తపై సచినో జోషి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

 రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

పోర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రాకి మరో షాక్‌ తగిలింది. సత్యయుగ్‌ గోల్చ్ స్కీమ్‌ కేసులో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలపై నటుడు సచిన్‌ జోషి విజయం సాధించారు.  అంతేకాదు ఈ సందర్బంగా రాజ్‌కుంద్రాపై సచిన్‌ జోషి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చేసిన పాపం ఊరికే పోదంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే, రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు  చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజ్‌కుంద్రాకి మరో షాక్‌ తగిలినట్టయ్యింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా,  `సత్యయుగ్  గోల్డ్` కంపెనీలో  అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. దాన్ని న‌మ్మిన స‌చిన్ జోషి కిలో బంగారాన్ని ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌గా పెట్టాడు. ఐదేళ్లు పూర్త‌యిన త‌ర్వాత స‌చిన్ జోషీకి బంగారం తిరిగి ఇవ్వ‌కుండా రాజ్‌కుంద్రా కంపెనీ అడ్డుగోలుగా వ్య‌వ‌హ‌రించింది.  ఈ నేపథ్యంలోనే  జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది.

దీనిపై నటుడు సచిన్‌ జోషి స్పందించారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్‌ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్‌లో  తనపైనే బురద చల్లారన్నారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు.  మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసినరాజ్‌కుంద్రా రిమాండ్‌ను మరో మూడు రోజుల పాటు  పొడిగించారు. జూలై 27వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ఇదిలా ఉంటే తెలుగు, హిందీలో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్‌ జోషి గతేడాది గుట్కా అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం