రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి..వైరల్ వీడియోలో ఏముందంటే..

By Surya PrakashFirst Published Apr 18, 2024, 6:03 AM IST
Highlights

ఈ వీడియోలో.. రఘుబాబు ఆందోళనగా కనపడగా.. పక్కన ఉన్న వ్యక్తులు నీళ్లు తాగమని సూచిస్తున్నారు. మీదేం తప్పు లేదు.. 


తెలంగాణలోని నల్గొండ పట్టణ సమీపంలోని అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు (48)గా గుర్తించారు. అయితే ఢీకొట్టిన కారు ప్రముఖ సినీనటుడు రఘుబాబుదిగా గుర్తించారు.  

రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్‌ రావు అదుపు తప్పి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  ప్రమాదంలో రఘుబాబుది తప్పులేదని వీడియోలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. 

ద్విచక్ర వాహనం మీద వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబుతో స్థానికులు మాట్లాడారు. అయితే.. ఈ వీడియోలో.. రఘుబాబు ఆందోళనగా కనపడగా.. పక్కన ఉన్న వ్యక్తులు నీళ్లు తాగమని సూచిస్తున్నారు. మీదేం తప్పు లేదు.. ఆయనదే తప్పుందంటూ వివరించటం గమనార్హం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి అసలు విషయాలు వెళ్లడించనున్నారు.

నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం అని తెలుస్తోంది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (51) బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే.. బుధవారం రోజు మధ్యాహ్నం సమయంలో.. పట్టణంలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన తన దత్త సాయి వెంచర్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో.. నటుడు రఘుబాబు తన కారులో (KA 03 MP 69 14) హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు రఘుబాబు కారు జనార్దన్ రావు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు కాగా.. స్పాట్‌లోనే మృతి చెందాడు. 
 

click me!