ఆయనకు 57 ఆమెకు 24... పృథ్విరాజ్ నన్ను పెళ్లి చేసుకోలేదంటూ శీతల్ కీలక ప్రకటన!

By Sambi ReddyFirst Published Mar 19, 2024, 7:56 AM IST
Highlights


నటుడు బబ్లు  పృథ్విరాజ్ 24 ఏళ్ల శీతల్ ని ప్రేమిస్తున్నానంటూ అప్పట్లో సంచలనానికి తెరలేపాడు. కాగా శీతల్ తాజాగా కీలక కామెంట్స్ చేసింది. పృథ్విరాజ్ తనను పెళ్లి చేసుకోలేదని కీలక విషయాలు వెల్లడించింది. 
 

57 ఏళ్ల బబ్లు పృథ్విరాజ్ 24 ఏళ్ల శీతల్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. వీరి రిలేషన్ మీడియాలో హైలెట్ అయ్యింది. పృథ్విరాజ్-శీతల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ తమ మనసులు కలిశాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ ఉన్నాయని వెల్లడించారు. మొదటి భార్య బీనాతో మనస్పర్థల వలన ప్రశాంతత కోల్పోయాను అన్న పృథ్విరాజ్ ఆమెకు విడాకులు ఇచ్చి శీతల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతల్ పేరెంట్స్ కూడా తమ రిలేషన్ ని అంగీకరించారని పృథ్విరాజ్ చెప్పారు. 

అయితే వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2022లో వివాహం చేసుకున్నట్లు వార్తలు రాగా... 2023లో విడిపోయారని కథనాలు వెలువడ్డాయి. తాజాగా పృథ్విరాజ్ తో తన రిలేషన్ గురించి శీతల్ ఓపెన్ అయ్యింది. ఆమె పృథ్విరాజ్ ని వివాహం చేసుకోలేదని వెల్లడించారు. శీతల్ మాట్లాడుతూ... మాకు వివాహం జరగలేదు. కేవలం సహజీవనం చేశాము అంతే. కొన్ని అనివార్య కారణాల వలన మా బంధం అనుకున్నట్లు సాగలేదు. అందుకే విడివిడిగా ఉంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి కొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్... అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 

పృథ్విరాజ్ 1994లో బీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి సంతానం. శీతల్ పరిచయం అయ్యాక బీనాకు విడాకులు ఇచ్చాడు. ఇక పృథ్విరాజ్ ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. పలు భాషల్లో చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పృథ్విరాజ్ నటించిన పెళ్లి, పెళ్లి పందిరి, సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. 

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ యానిమల్ మూవీలో పృథ్విరాజ్ విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్-రష్మిక మందాన జంటగా నటించారు. బాబీ డియోల్ మెయిన్ విలన్ రోల్ చేయగా... పృథ్విరాజ్ మరో విలన్ గా నటించి మెప్పించారు. యానిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

click me!