అమితాబ్ కి ప్రమాదం.. ధారాపాతంగా రక్తం కారడంతో హుటాహుటిన ఆసుపత్రికి!

By Sambi ReddyFirst Published Oct 23, 2022, 5:19 PM IST
Highlights


బిగ్ బీ అమితాబ్ ప్రమాదం బారినపడ్డారు. షూటింగ్ లో పాల్గొన్న ఆయన కాలికి గాయమైంది. రక్తస్త్రావం తీవ్రస్థాయిలో ఉండగా సిబ్బంది ఆయన్ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 

దీపావళి పండగనాడు ఫ్యాన్స్ ని అమితాబ్ ఆందోళనకు గురి చేశారు. తాను ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నేపథ్యంలో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. అమితాబ్ ట్విట్టర్లో... షూటింగ్ సెట్ లో పదునైన ఇనుప ముక్క నా కాలును బలంగా తాకింది. దీంతో ఎడమ కాలు నరం తెగి విపరీతంగా రక్తస్రావం జరిగింది. బ్లీడింగ్ అధికంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

డాక్టర్స్ గాయానికి కుట్లు వేసి వైద్యం చేశారు . అలాగే కొన్ని రోజుల పాటు నడవ కూడదని, బెడ్ కే పరిమితం కావాలని సూచించారు. నేను క్షేమంగానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు... అంటూ సందేశం పోస్ట్ చేశారు. కోన్ బనేగా కరోడ్ పతి షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమితాబ్ ఈ షో షూటింగ్ లో పాల్గొన్నారట. అక్కడ ఈ అనుకోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 
 

T 4447 - आया त्योहार का मौसम, फैली खुशियों की खुशबू।
कामना करता हूं आपकी दिवाली भी हो सकारात्मकता और खुशबू से भरी।
शुभ दीपावली! 🙏🏼

In partnership / promotion with @legend1942_ pic.twitter.com/C9cW3kYUNM

అమితాబ్ ప్రస్తుతం  కొన్ని హిందీ, ఒక తెలుగు, మరొక కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. కాలికి గాయమైన తరుణంలో కొన్నాళ్ళు అమితాబ్ షూటింగ్లో పాల్గొనే ఆస్కారం లేదు. ఈ క్రమంలో సదరు చిత్రాల షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. రష్మిక-అమితాబ్ ప్రధాన పాత్రల్లో నటించిన గుడ్ బై అక్టోబర్ 7న విడుదలైంది.

click me!