'సరిలేరు నీకెవ్వరు'.. సెకండ్ డే కలెక్షన్స్!

By AN TeluguFirst Published Jan 13, 2020, 12:38 PM IST
Highlights

మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండో రోజు మొత్తంగా రూ.63 నుండి 65 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తొలిరోజే హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.

మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండో రోజు మొత్తంగా రూ.63 నుండి 65 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మూడో రోజున ఈ సినిమా వంద కోట్లు దాటేలా ఉందని అంటున్నారు.

'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్లు!

మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా రాబట్టింది. గతంలో మహేష్ నటించిన 'మహర్షి' సినిమా తొలిరోజు రూ.24.68 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని 'సరిలేరు నీకెవ్వరు' బ్రేక్ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని దాదాపు రూ.75 కోట్లకు అమ్మారని సమాచారం. తొలిరోజే ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ సాధించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తీసుకురావడం ఖాయమనిపిస్తోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి కీలకపాత్ర పోషించింది. 

click me!