కరోనా కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇళ్లలనే ఉండిపోయారు. సినిమాల షూటింగ్లు ఇతర కార్యక్రమాలు ఆగిపోవటంతో సినిమా తారలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఇళ్ల నుంచి కరోనా పై పోరాటం విషయంలో ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తన వంతుగా అభిమానులకు కరోనా సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నాడు.
ఈ ఖాళీ సమయంలో ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో రంగంలొకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ సత్తా చాటుతున్న సల్లూ భాయ్, ఇప్పుడు మరో రంగంలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. తన ఫ్లాప్ సినిమాలతో కూడా కోట్లు కొల్లగొడుతున్న సల్మాన్, టీవీలో బిగ్ బాస్ షోతో అభిమానులను అలరిస్తున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటున్నాడు సల్మాన్.
తాజాగా ఈ కండల వీరుడు మరో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో సొంత యూట్యూబ్ చానెల్ను ప్రారంభిస్తున్నాడు సల్మాన్. ఈ ఛానల్ తన సినిమాల ప్రమోషన్ కోసం వినియోగించేలా ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్. అదే సమయంతో తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఈ ప్లాట్ ఫాం ఉపయోగపడుతుందని భావిస్తున్నాడట ఈ సూపర్ స్టార్. ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్న సల్మాన్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా కోట్ల కొల్లగొట్టాలని చూస్తున్నాడన్న వాదన కూడా వినిపిస్తోంది.