ఆర్టికల్ 370రద్దు: మహేష్ కి బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ

By Prashanth MFirst Published Nov 7, 2019, 8:04 AM IST
Highlights

సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కి వచ్చేసింది. చాలా రోజుల తరువాత మహేష్ మంచి ఎంటర్టైన్ పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానులకు ఈ సంక్రాంతికి అసలైన ఫెస్టివల్ వచ్చినట్టే. పొంగల్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ని కాశ్మిర్ వంటి సెన్సిటివ్ ఏరియాలో కూడా షూట్ చేశారు.

F2 లాంటి బాక్స్ ఆఫీస్ హిట్ అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కి వచ్చేసింది. చాలా రోజుల తరువాత మహేష్ మంచి ఎంటర్టైన్ పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానులకు ఈ సంక్రాంతికి అసలైన ఫెస్టివల్ వచ్చినట్టే. పొంగల్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ని కాశ్మిర్ వంటి సెన్సిటివ్ ఏరియాలో కూడా షూట్ చేశారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అనిల్ సుంకర ఒక షూటింగ్ కి సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పారు. షూటింగ్ లో భాగంగా కొన్ని సీన్స్ ని కాశ్మీర్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుపుకోవడానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారట.

షూటింగ్ సమయాల్లో మహేష్ కి బుల్లేట్ ప్రూఫ్ సెక్యూరిటీ కుడా ఇచ్చినట్లు చెప్పారు.  అయితే షూటింగ్ సమయాల్లో పెట్టిన కొన్ని ఆంక్షలు మాకు అర్ధం కాలేదు.  ఎందుకు ఇలా ఆంక్షలు పెడుతున్నారు అని  కాస్త కన్ఫ్యూజ్ అయ్యాము. ఇక ఆ తరువాత కాశ్మీర్ ఆర్టికల్ 370రద్దు గురించి తెలుసుకున్నామని నిర్మాత తెలియజేశారు.

ఆర్టికల్ 370రద్దు జరిగిన ఒకరోజు ముందే షూటింగ్ అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా షూటింగ్ కి కల్పించిన భద్రత గురించి అనిల్ సుంకర గొప్పగా వివరించారు.

Read also: శాటిలైట్ రైట్స్: కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన టాప్ మూవీస్

ఇక మహేష్ మాత్రం డిసెంబర్ నుంచి తన అసలైన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నాడట. సినిమాలో నటించిన కమెడియన్స్ ని మహేష్ స్పెషల్ ఇంటర్వ్యూ చేననున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

click me!