ట్విస్ట్: డ్రైవర్ రాజుపై సినీ నటి ముమైత్ ఖాన్ ఫిర్యాదు

By telugu teamFirst Published Oct 1, 2020, 6:11 PM IST
Highlights

గోవా ట్రిప్ విషయంలో తనపై ఆరోపణలు చేసిన డ్రైవర్ రాజుపై సినీ నటి ముమైత్ ఖాన్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై రాజు అసత్య ప్రచారం సాగిస్తున్నాడని ఆమె ఆరోపించారు.

హైదరాబాద్: డ్రైవర్ రాజుపై సినీ నటి ముమైత్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని పంజగుట్ట పోలీసు స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. డ్రైవర్ రాజు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న రాజుపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. 

తనను గోవా ట్రిప్ నకు తీసుకుని వెళ్లి ముమైత్ ఖాన్ డబ్బులు ఇవ్వలేదని రాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినీ నటి ముమైత్ ఖాను మూడు రోజుల కోసం గోవాకు కారును మాట్లాడుకుందని, అయితే ఐదు రోజుల పాటు గోవాలో తిప్పిందని, రూ.30 వేలకు కారును మాట్లాడుకుందని రాజు చెప్పాడు. 

డీజిల్ ఖర్చలు అడిగితే ఇవ్వలేదని చెప్పాడు. కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని, అలా చేయవద్దని చెప్పినందుకు తనను బండ బూతులు తిట్టిందని అతను చెప్పాడు. 

గోవా నుంచి వచ్చిన వెంటనే తాను 100కు కాల్ చేసి విషయం చెప్పానని, రోజు కూలీ చేసుకునే తన పట్ల ముమైత్ ఖాన్ అలా వ్యవహరిస్తుందని అనుకోలేదని అతను అన్నాడు. తనకు రావాల్సిన రూ.15 వేలు ఇస్తుందో లేదో తెలియదని, డ్రైవర్ల సంఘంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. 

టోల్ గేట్ కు, డ్రైవర్ వసతికి డబ్బులు కూడా ఇవ్వలేదని ముమైత్ ఖాన్ మీద అతను విమర్శలు చేశాడు. టోల్ గేట్ వద్ద కట్టిన డబ్బులకు సంబంధించిన రిసీట్స్ ను, ముమైత్ ఖాన్ తో కలిసి దిగిన ఫోటోలను, ఆమెతో చేసిన వాట్సప్ చాట్ ను రాజు షేర్ చేశాడు.

click me!