నిర్మల్ జిల్లాలో క్రికెట్ ఆట ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. కుంటాల మండలం రాజాపూర్లో క్రికెట్ ఆడుతుండగా జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసింది. సతీష్ అనే బాలుడు ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా వివాదం చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లాలో క్రికెట్ ఆట ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. కుంటాల మండలం రాజాపూర్లో క్రికెట్ ఆడుతుండగా జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసింది. సతీష్ అనే బాలుడు ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా వివాదం చోటు చేసుకుంది.
క్షణికావేశంలో ఆ బాలుడిని తోటి మిత్రులు రాయితో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయంతో మృతదేహాన్ని మొక్క జోన్న చేనులో పడేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
తల పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోవడంతో డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ సాయంతో ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక ఎవైనా పాత గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also Read:
అవనిగడ్డ బాలుడి హత్య కేసులో వీడిన మిస్టరీ
బాలుడి హత్య: తల్లిపై అనుమానాలు, అక్రమ సంబంధం బయటపడుతుందని...?