
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో క్వాలిఫై కథ ముగిసింది. శనివారం నుంచి అసలు సిసలు సూపర్ - 12 మొదలుకానుంది. క్వాలిఫై రౌండ్ లో 8 జట్లు పోటీ పడగా అందులోంచి శ్రీలంక, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ లు సూపర్-12కు అర్హత సాధిచాయి. ఈ నేపథ్యంలో భారత్ షెడ్యూల్ ఎలా ఉంది..? ఈనెల 23 తర్వాత భారత్.. ఏ జట్లతో పోటీ పడనుంది..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.
టీమిండియా ఈనెల 23న పాకిస్తాన్ తో మ్యాచ్ ద్వారా ఈ ప్రపంచకప్ వేటను మొదలుపెట్టనుంది. మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లు మెల్బోర్న్కు చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.
టీమిండియా షెడ్యూల్, వేదిక, టైమ్ :
- అక్టోబర్ 23 : ఇండియా - పాకిస్తాన్
వేదిక : మెల్బోర్న్, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
- అక్టోబర్ 27 : ఇండియా - నెదర్లాండ్స్
వేదిక : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మ్యాచ్ టైం : మధ్యాహ్నం 12.30 నుంచి
- అక్టోబర్ 30 : ఇండియా - సౌతాఫ్రికా
వేదిక : పెర్త్ స్టేడియం. మ్యాచ్ టైం : సాయంత్రం 4.30 నుంచి
- నవంబర్ 02 : ఇండియా - బంగ్లాదేశ్
వేదిక : అడిలైడ్ ఓవల్. మ్యాచ్ టైం : మధ్యాహ్నం 1:30 నుంచి
- నవంబర్ 06 : ఇండియా - జింబాబ్వే
వేదిక : మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. మ్యాచ్ టైం : మధ్యాహ్నం 1.30 నుంచి..
భారత్ తో సహా టీ20 ప్రపంచకప్కు సంబంధించిన మ్యాచ్ లన్నీ స్టార్ నెట్వర్క్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లో వీక్షించొచ్చు.
గ్రూప్ : బిలో ఉన్న జట్లు : ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్
- సూపర్ - 12లో భాగంగా రెండు గ్రూపుల నుంచి టాప్ 2 గా నిలిచిన రెండు జట్లు సెమీస్కు చేరతాయి. నవంబర్ 9న తొలి సెమీస్ (సిడ్నీ), నవంబర్ 10న రెండో సెమీస్ (అడిలైడ్) జరుగనుండగా.. నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఫైనల్ జరుగుతుంది.