కోహ్లీ బంపర్ ఆఫర్ పై స్పందించిన కెఎల్ రాహుల్...ఏమన్నాడంటే

By Arun Kumar PFirst Published May 29, 2019, 8:21 PM IST
Highlights

బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్ లో కెఎల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తక్కువ పరుగులకే ఓపెనర్లిద్దరు వికెట్లు కోల్పోయిన సమయంలో సీనియర్లు కోహ్లీ, ధోని సహకారంతో రాహుల్ ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి రాహుల్  ఇన్నింగ్స్ ద్వారా పరిష్కారం లభించినట్లయింది. 
 

బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్ లో కెఎల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తక్కువ పరుగులకే ఓపెనర్లిద్దరు వికెట్లు కోల్పోయిన సమయంలో సీనియర్లు కోహ్లీ, ధోని సహకారంతో రాహుల్ ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి రాహుల్  ఇన్నింగ్స్ ద్వారా పరిష్కారం లభించినట్లయింది. 

ఈ వార్మప్ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... రాహుల్ ఈ స్థానంలో బ్యాటింగ్ కు సరిగ్గా సరిపోయాడని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచుల్లో కూడా అతన్ని ఈ స్థానంలోనే ఆడించనున్నట్లు కోహ్లీ వ్యాఖ్యలనుబట్టి తెలుస్తోంది. ఇలా ప్రపంచ కప్ జట్టులో ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కుతుందా అనుకున్న రాహుల్ కు కోహ్లీ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు.   

ఈ ఆఫర్ ను స్వీకరించడానికి రాహుల్ కూడా సిద్దమైనట్లు అతడి మాటల్ని బట్టి తెలుస్తోంది. '' టీమిండియా మేనేజ్ మెంట్ నాపై కొత్త బాధ్యతలు పెట్టింది. నాపై వారికున్న నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దని కసితో ఆడా. దాని ఫలితమే బంగ్లాపై సెంచరీ. నేను ఏ స్థానంలో అయినా ఆడగలనని నిరూపించుకోడానికి మేనేజ్ మెంట్  మంచి అవకాశాన్ని ఇచ్చింది. తాను గిరిగీసుకుని ఇక్కడయితేనే ఆడతాననే రకం కాదని... జట్టు అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా బరిలోకి దిగడానికి సిద్దం.'' అని  రాహుల్ పేర్కొన్నాడు. 

ప్రపంచ కప్ మెయిన్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచులో భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు మరోసారి  విఫలమైనా టాప్ ఆర్డర్ లో కోహ్లీ (46పరుగులు)  పరవాలేదనిపించాడు. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108 పరుగులు), ధోని (78 బంతుల్లో 113 పరుగులు) సెంచరీలతో అదరగొట్టడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఈ  భారీ లక్ష్యాన్ని చేధించడం కోసం బరిలోకి దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా  95 పరుగుల తేడాతో గెలుపొందింది.  

మరిన్ని వార్తలు 

నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన కోహ్లీ...పరోక్షంగా అతడికే మద్దతు
 

click me!