
TG20 League : తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సరికొత్త ప్రయత్నం చేస్తోంది... అదే టీజి 20 లీగ్ (TG20 League).సేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాదిరిగానే తెలంగాణ జిల్లాల పేరుతో ఈ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 8 జట్లు 21 రోజులపాటు 32 మ్యాచుల్లో తలపడనున్నాయి.
అయితే ఇవాళ (జూన్ 24, బుధవారం) మధ్యాహ్నం అన్విత ఖమ్మం ఏసెస్, వరంగల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ గుప్తా 54 పరుగులు (36 బంతుల్లో), మిక్కిల్ జైస్వాల్ 54 పరుగులు (22 బంతుల్లో) లతో మెరిశారు... దీంతో ఖమ్మం టీం డబుల్ సెంచరీ స్కోరు సాధించింది.
203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ హర్షిత్ చౌదరీ కేవలం 62 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 121 పరుగులు (నాటౌట్) సాధించాడు... ఇతడి విధ్వంసకర బ్యాటింగ్ ముందు ఖమ్మం బౌలర్ల ఆటలు సాగలేవు... దీంతో కేవలం 18.5 ఓవర్లలోనే వరంగల్ లక్ష్యాన్ని చేధించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.